prajadivaas.in
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 2:28 pm Digital Edition : PRAJA DIVAAS MEDIA

మాస్టర్ మైండ్ స్కూల్లో మహిళా సాధికారిక పై ప్రత్యేక కార్యక్రమం

సిరిసిల్ల పట్టణంలో మాస్టర్‌మైండ్స్ స్కూల్‌లో శనివారం మహిళా సాధికారత పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ సంస్థ చైర్మన్ సంఘాని రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు లేనిదే ఈ ప్రపంచం లేదని మహిళల అనే రంగాల్లో ముందుకు రావాలని ముఖ్యంగా ఇంట్లో మహిళలు చేసే కార్యక్రమాలు ఆ ఇల్లు పురోగతి చెందుతుందని మహిళా ప్రగతి దేశానికి ముఖ్యమని ఈ సందర్భంగా తెలిపారు ఆడపిల్లల చదివే ఇంటికి వెళ్ళుగ అంటూ ప్రతి ఆడబిడ్డలు చదివించాలని ఆ చదువుతూనే వాళ్లకు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయని అదేవిధంగా భావి భారత పురోగతికి ఆడపిల్ల చాలా ముఖ్యమని అన్నారు ఆయన మహిళల గొప్పతనాన్ని వివరించి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ప్రోత్సహించారు. నేడు మహిళలు ఆర్మీ నేవీ ఎయిర్ఫోర్స్ అనే రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని దాంతోపాటుగా విద్య వైద్యం ప్రొఫెషనల్ కెరియర్ లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు మహిళల విద్య, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముగించారు