ఈ రోజు మండేపల్లి గ్రామం లో మహిళా స్వశక్తి సమాఖ్య నూతన భవనాలకు భూమి పూజా కార్యక్రమం…
గ్రామం లోని ప్రియదర్శిని,శ్రీ చైతన్య,ఉజ్వల మహిళా గ్రూప్ లకు ఒక్కొకటి 10 లక్షల రూపాయలతో మంజూరు కాగా నేడు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరల నర్సింగ0 గౌడ్, సర్పంచ్ సాగర్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ గారి చేతుల మీదుగా. భూమి పూజా చేయడం జరిగింది.
అనంతరం మహిళలందరూ ప్రజా పాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేశారు.
ఇట్టి కార్యక్రమం లో మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హారికా రెడ్డి,జిల్లా యూత్ నాయకులు మునిగేల రాజు, గ్రామ ఉప సర్పంచ్ మరియు పాలక వర్గ సభ్యులు, సిఏ లు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.