ePaper
Friday, April 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper

📰 Generate e-Paper Clip

*పోలింగ్ రోజున పబ్లిక్ హాలిడే*

*ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్*

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి – 9 ప్రజా దివాస్

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఆయా కేంద్రాల్లో ముందు రోజు
(ఈ నెల 10 వ తేదీన మంగళ వారం) అలాగే పోలింగ్ రోజున (ఈ నెల 11 వ తేదీన బుధవారం) సెలవులు ప్రకటించినట్లు ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు.

ఈ నెల 11వ తేదీన బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ నిర్వహించే కేంద్రాల్లో ముందు రోజు అలాగే పోలింగ్ రోజు జిల్లాలోని విద్యా సంస్థలు, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన కార్యాలయాలకు స్థానిక సెలవులు ఉంటాయని పేర్కొన్నారు.

చట్ట ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కార్పొరేషన్లు, సంస్థల ఉద్యోగులు, సిబ్బంది ఓటు హక్కు వినియోగించు కునేందుకు పోలింగ్ రోజున ఈ నెల 11వ తేదీన సెలవు వర్తిస్తుందని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!